Supreme Court | న్యూఢిల్లీ: ఎన్నికల్లో నోటాకు మెజారిటీ ఓట్లు వస్తే మళ్లీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలన్న అంశంపై సుప్రీం కోర్టు ఈసీని వివరణ కోరింది.
అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, మళ్లీ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో సామాజిక కార్యకర్త శివఖేరా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.