రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటున్నది. ఎకరాకు రూ.5వేల చొప్పున అంది స్తుండగా, యాసంగి సీజన్కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.874.89 కోట్లు విడుదల చేసింది. పది రోజుల్లో అర్హులందరికీ అందించే ప్రక్రియ పూర్తి చేయనుండగా, మొదటి రోజు మంగళవారం ఎకరాలోపు ఉన్న వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇందుకు సంబంధించిన మెస్పెజ్లు సెల్ఫోన్లకు రాగా, రైతాంగం వాటిని చూసి మురిసిపోయింది. ఆయా బ్యాంక్లు, ఏటీఎంలలో నగదు విత్డ్రా చేసుకుంటూ సకాలంలో పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి పంటకాలనికి సంబంధించిన రైతుబంధును సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,94,059 మంది పట్టాదారులుండగా, మొత్తం 17,49,797 ఎకరాలలో సాగు చేశా రు. ఎకరానికి రూ. 5 వేల చొప్పున, ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న వారికి మొదటి రోజు జమ చేశారు. రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ గతంలో మాదిరిగానే పది రోజుల్లో పంపిణీ పూర్తి చేయనున్నారు. రైతుబం ధు ద్వారా అన్నదాతలకు రెండు సీజన్లకు గాను రూ.10 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది.
రూ.874.898 కోట్లు పంపిణీ..
ప్రస్తుత యాసంగి సీజన్లోనూ రాష్ట్ర సర్కారు రైతుబంధు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభించింది. ఈ సీజన్లో రైతు బంధుకు అర్హులైన రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,94,059 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీరికి రూ.874.898 కోట్ల నగదును జమ చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,48,818 మంది పట్టాదారులుండగా, మొత్తం 5,54,530 ఎకరాలలో వారు సాగు చేశారు. ఇందులో భాగంగా వారికి రూ.277.265 కోట్ల సాయం అందనుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19,165 మంది రైతులకు గాను 4,03,275 ఎకరాలకు పెట్టుబడి సాయం రూ.201.637 కోట్లు.. నిర్మల్ జిల్లాలో 1,78,535 మంది అన్నదాతలకు 4,52,478 ఎకరాలకు గాను రూ.226.239 కోట్లను జమచేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో 1,47,541 మంది పట్టాదారులకు 4,52,478 ఎకరాలకు గాను, రూ. 169.757 కోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా తొలిరోజైన మంగళవారం 42,062 మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.12 కోట్ల 78 లక్షల 51 వేల 924 వారివారి అకౌంట్లలో జమ అయ్యాయి. బుధ వారం ఒక ఎకరం నుంచి రెండెకరాలలోపు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమవుతుండగా, రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
యాసంగి కాలానికి సంబంధించిన రైతు బంధు నగదు ఖాతాల్లో జమవుతుండడంతో, అన్నదాతల ఇంట సంతోషం వెల్లివిరుస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, రామకృష్ణాపూర్లలో రైతులు, రైతు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చెన్నూర్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లెల దామోదర్రెడ్డి, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, రామకృష్ణాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, పార్టీ సమన్వయకర్త అబ్దుల్ అజీజ్, కోటపల్లిలో వైఎస్ ఎంపీపీ వాల శ్రీనివాస్, తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
సర్కారు సాయం మరువలేం
నాకు గూడ గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమి ఉంది. వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది పంటలు సాగు చేశాం. యాసంగిలో శనగ పంట వేస్తున్న. సర్కారు వానకాలం, యాసంగిలో రైతుల కు రైతుబంధు సాయాన్ని అందజేస్తున్నది. యాసంగి పంటలకు పెట్టుబడిని అందించడం సంతోషంగా ఉంది. సర్కారు సాయాన్ని ఎప్పటికీ మరువలేం.
-షేక్ దస్తగిరి. రైతు, గూడ, జైనథ్
రూ. 5 వేలు అకౌంట్ల పడ్డయ్..
కుభీర్, డిసెంబర్ 28: రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న సంకల్పంతో పెట్టుబడి అందించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు రైతు బంధువులా మాకు అండగా నిలుస్తున్నడు. తెలంగాణ అచ్చిన తర్వాత ఎవుసాన్ని పండుగలా మార్చిండు. నాకు ఎకరం భూమి వుంది. ఇయ్యాల రూ.5వేలు నా అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. ఈడనే మినీ ఏటీఎంల డబ్బులు తీసుకున్న.. ఆనందంగా ఉంది. ఇప్పటికే 24గంటల ఉచిత కరంట్, రైతు బీమా మహోన్నతమైన పథకాలతోనే రాష్ట్రం సుభిక్షంగా మారింది.
-లంక సురేశ్, రైతు, పార్డి(కె)
శనగ, జొన్న పంటలు వేస్త..
రైతులకు ప్రభుత్వం అవసరమైన సమయంలో ఎకరానికు రూ.5 వేల పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. నాకు 4 ఎకరాల భూమి ఉంది. వానకాలంలో పత్తి, కంది పంటలు వేసిన. యాసంగిలో శనగ, జొన్న పంటలు వేద్దామనుకుంటున్న. రైతుబంధు రాక ముందు పంటల సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. సర్కారు రైతులకు అందించే పైసలు ఇత్తనాలు, ఎరువులకు ఉపయోగపడుతయి.
-బోళ్ల విఠల్, కొరట, జైనథ్ మండలం
రైతు శ్రేయస్సు కోసమే..
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 28 :తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలు తొలిగినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసుకాబట్టే రైతుబంధు ప్రారంభించి మా లాంటి వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచారు. పెట్టుబడి సాయం అనేది దేశంలోనే ఒక అద్భుత పథకం. పంట పెట్టుబడులకు వడ్డీలకు ఫైనాన్స్ల వద్దకు వెళ్లకుండా ఈ పథకం ద్వారా మాలాంటి రైతులందరికీ రైతుబంధు ద్వారా ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఇది రైతు రాజ్యం. జై కేసీఆర్.
ఎంతో ఆనందంగా ఉంది
లోకేశ్వరం, డిసెంబర్, 28 : రైతు బంధుతోనే అన్నదాతలంతా సంతోషంగా ఉన్నరు. వానకాలం పంటకు గత జూన్లో సాయం అందించిన్రు. యాసంగికు రైతుబంధు సాయం మంగళవారం నుంచి వేస్తున్నరు. నాకు కూడా పైసలు పడినయ్. బ్యాంకుల నుంచి ఇడపించిన. సకాలంలో సాయం అందించి రైతులను ఈ సర్కారోళ్లు ఆదుకుంటున్నరు. పెట్టుబడికి పైసల్లేక ఇంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడినం. కరెంట్ కోతలు, ఎరువులు, ఇత్తనాలు దొరక్క మనశ్శాంతి లేకుండా పోయేది. ఎవుసం బంద్జేద్దామా అనిపించేది. ఇప్పుడా ఇబ్బంది లేదు.
-నక్క రాజన్న, రైతు
ఇది రైతులకు వరం
కుభీర్, డిసెంబర్ 28: ఎవుసం చేసే రైతులకు పెట్టుబడి భారం కాకూడదని సీఎం కేసీఆర్ ఏడాదికి ఎకరాకు రూ.10వేలు అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. నాకు ఎకరం భూమి ఉంది ఈరోజు నా అకౌంట్లో యాసంగి పెట్టుబడి సాయం రూ.5వేలు వేసిన్రు. షావుకార్ల వద్దకు వెళ్లి వంగి నమస్కరించే పరిస్థితి నుంచి తలెత్తుకొని వ్యవసాయం చేసేటట్లు చేసిన కేసీఆర్కు ఏమిచ్చి రుణం తీర్చుకోను.
-ముడుగుల గంగాధర్, రైతు, బెల్గాం
నాకు రూ. ఐదు వేలు వచ్చినయ్..
కోటపల్లి, డిసెంబర్ 28: నాకు కోటపల్లి శివారులో ఎకరం భూమి ఉంది. ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇచ్చే రైతుబంధు సాయం రూ.5వేల డబ్బులు నా ఖాతాలో జమ అయ్యా యి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు.. యేటా నాకు రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు అందజేస్తున్నది. రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సహాయంతో అప్పులు చేయకుండా వ్యవసాయం చేసుకోవచ్చు.
లాభసాటిగా ఎవుసం
కుంటాల, డిసెంబర్ 28: గతంల పంటలు పండక, కరెంటు కోతలతో రైతులు అప్పుల పాలయ్యేది. ఇప్పుడా ఇబ్బంది లేదు. సీఎం కేసీఆర్ కారణంగా వ్యవసాయం లాభసాటిగా మారింది. సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నడు. రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం సకాలంలో చేతికందుతున్నది. వడ్డీ వ్యాపారుల తిప్పలు తప్పింది. నిరంతర కరంటుతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటున్న కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటం.
-చౌహాన్ రమేశ్, గుమ్మాపూర్,
కూరగాయల పెట్టుబడికి పనికొస్తయ్..
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 28 :నాకున్న ఎకరంలో ఆన కాలం తిండికి సన్నపడ్లు ఏసి, ఎండాకాలం ఆకు కూరలు, కూరగాయలు ఏస్తుంటా. వీటికి పెట్టుబడికి కేసీఆర్ సారు డబ్బులు వేసిండు. రైతుల కష్టం తెలుసుకాబట్టే మాకు ఈ రైతుబంధు పేరిట రూ.5 వేలు ఇస్తుండు. వీటితో పంటల పెట్టుబడికి మొదట ఎంతో ఉపయోగపడుతున్నయ్. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏ రైతు మరువడు.
అప్పుల గోస తీరింది
కుంటాల, డిసెంబర్ 28: గతంలో ఏటా రెండు సీజన్లలో పెట్టుబడుల కోసం ప్రైవేటుగా అప్పులు తీసుకునేది. వాళ్లు సమయానికి ఇయ్యకుంటే చాలా ఇబ్బందులు పెట్టేటోళ్లు. ఇప్పుడు సీఎం కేసీఆరే రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నడు. రైతుబంధు వచ్చినంక రైతులకు చాలా ఇబ్బందులు తప్పినయ్. రైతులు ఆనందంగా ఉన్నరు. అప్పుల గోస తీరింది.
-సూర్యవంశీ కామాజీ, మెదన్పూర్, కుంటాల
రైతు బంధు ఆదుకుంటున్నది
కుంటాల, డిసెంబర్ 28: రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఓ బృహత్తర పథకం. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నరు. సకాలంలో పెట్టుబడికి సహాయం అందడంతో సాగుకు అవసరమ య్యే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసుకుంటున్నం. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేసేవాళ్లం. తెలంగాణ వచ్చాకే రైతుల బతుకులు మారుతున్నయ్. ఇలాంటి ప్రభుత్వానికి ఎల్లవేళలా అన్నదాతలు బాసటగా ఉంటారు.
-షేక్ రహీం, రైతు, అంబకంటి
ఐదువేల రూపాలు అచ్చినయ్..
నాపేరు రావుత్ జయ. మాది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కేథార్పూర్. నా పెనిమిటి పేరిట రెండెకరాలు. నా పేరుమీద ఎకరం జాగ ఉంది. ఇందులో పత్తి సాగు జేస్తూ అంతరంగా కంది వేస్తాం. మంగళారం నడిపొద్దున నా అకౌంట్లో ఎకరా జాగ రైతుబంధు పైసలు ఐదువేల రూపాలు పడ్డట్టు సెల్ఫోన్కు మెస్సేజ్ అచ్చింది. మా ఆయన పేరుమీదున్న రెండెకరాలకు ఈ రెండు, మూడు రోజుల్లో పది వేలు వస్తయని బేంకోళ్లు సెప్పిండ్రు. గిప్పటికీ ఎనిమిది సార్లు పైసలు తీసుకున్నం. గతంల పెట్టుబడికి అరిగోస పడేటోళ్లం. బేంకులు, సావుకార్ల సుట్టు తిరిగితిరిగి యాష్టకచ్చేది. గిప్పుడు కేసీఆర్ సారూ మా కట్టాలు సూసి పెట్టుబడికి సాయం జేత్తండు. ఆయన పది కాలాలు సల్లంగుండాలె.