కాన్పూర్ : వచ్చే నెల మొదటి వారంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండనున్నది. ఈ విషయాలను ఐఐటీ కాన్పూర్ తన పరిశోధనలో తేల్చింది. ఈ కాలంలో చాలా మంది కరోనా వైరస్కు గురవుతారని పేర్కొన్నారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలో ఈ అధ్యయనం కొనసాగింది.
కంప్యూటర్ ఆధారిత మోడల్పై ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, అతని బృందం గత వారం రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా సగటు కేసులను అధ్యయనం చేసింది. వీరి అధ్యయనం ప్రకారం మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టగా.. 7 రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి. మహారాష్ట్రలో రాబోయే కొద్ది రోజుల్లో కేసులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇదే సమయంలో, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్లలో ఏప్రిల్ 20-30 మధ్య గరిష్ఠంగా కరోనా వ్యాప్తి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత మోడల్ నుంచి సేకరించిన డాటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో ఒకరోజులో గరిష్ఠంగా 32 వేల మంది, బిహార్లో 9 వేలు, ఢిల్లీలో 30 వేలు, రాజస్థాన్లో 10 వేలు, పశ్చిమ బెంగాల్లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి.
కుంభమేళా, ఎన్నికల ర్యాలీలలు కరోనా వైరస్ పెరిగేందుకు ప్రభావం చూపవని వీరి అధ్యయనం పేర్కొన్నది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. అయితే, దేశ పరిస్థితిని మరింత దిగజార్చే ఎటువంటి ప్రభావం ఉండదని అధ్యయనంలో తెలిపారు.
బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఎన్నికల సభలు, ర్యాలీలని కారణాలు చెప్తున్నవారు.. మహారాష్ట్ర, ఢిల్లీలో ఏ కారణాలు చెప్తారని ప్రోఫెసర్ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలు జరుగుతున్నందున అటువంటి పరిస్థితిలో వైరస్ ఎక్కువగా వ్యాపించదని ఆయన వెల్లడించారు.
మే 6 వ తేదీ నాటికి తమిళనాడులో కరోనా ఉధృతంగా ఉంటుందని ప్రొఫెసర్ అగర్వాల్ చెప్తున్నారు. అయితే, ఈ డాటా ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియలేదు. అదేవిధంగా గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల డాటా కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ రాష్ట్రాలపై అధ్యయనం ఇప్పటికీ కొనసాగుతున్నదని అగర్వాల్ పేర్కొన్నారు.
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..