తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం టీజర్ను లాంచ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యం, డ్రామా కలబోతగా టీజర్ ఆకట్టుకుంది. ఇందులో చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్భాస్కర్ కనిపించారు.
గోదావరి జిల్లాల నేపథ్యంలో నడిచే హాస్యభరిత చిత్రమిదని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇదని తరుణ్భాస్కర్ పేర్కొన్నారు. ఈ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని దర్శకుడు సజీవ్ తెలిపారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు.