చండూరు, డిసెంబర్ 01 : నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి “తెలుగు వాక్యనిర్మాణం -మాండలిక భేదాలు” అనే అంశంపై ఆచార్య ఐనవోలు ఉషాదేవి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా జయకృష్ణను విశ్వ విద్యాలయ ఉప కులపతి ఆచార్య వి.నిత్యానందరావు, రిజిస్టార్ ఆచార్య హనుమంతరావు అభినందిచారు.