TCS Q2 Results | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్, అనలిస్ట్స్ అంచనాలను బ్రేక్ చేసింది. 2021-22తో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రెవెన్యూలో 18 శాతం గ్రోత్తో రూ.55,309 కోట్ల ఆదాయం సంపాదించింది. నికర లాభాలు 8.4 శాతం వృద్ధి చెంది రూ.10,431 కోట్లకు చేరుకున్నది. ఈక్విటీ షేర్పై రూ.8 రెండో ఇంటరిమ్ డివిడెండ్ ఇవ్వనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉంటే వార్షిక ప్రాతిపదికన టీసీఎస్ నుంచి 21.5 శాతం ఉద్యోగులు అట్రిక్షన్ (వలస) వెళ్లడం గమనార్హం.
టీసీఎస్ నిర్వహణ లాభాలు 1.6 నుంచి 24 శాతానికి తగ్గాయి. పాట్ రూ.10 వేల కోట్లు దాటినా నిర్వహణ లాభాలు పడిపోవడం ఆసక్తికర పరిణామం. `మా సర్వీసులకు చాలా గిరాకీ ఉంది. అన్ని మేజర్ మార్కెట్లలో స్ట్రాంగ్, ప్రాఫిటబుల్ గ్రోత్ సాధించాం` అని టీసీఎస్ సీఈవో కం ఎండీ రాజేశ్ గోపినాథన్ చెప్పారు.
రిటైల్, సీఎంఐ సెగ్మెంట్స్ సారధ్యంలో అన్ని రంగాల్లో వృద్ధి నమోదు చేసింది. కరెన్సీ రూపేణా టీసీఎస్ వృద్ధిరేటు 15.4 శాతంగా ఉంది. నార్త్ అమెరికాలో 17.6 శాతం, యూరప్లో 14.1, యూకేలో 14.8, భారత్లో 16.7, లాటిన్ అమెరికాలో 19, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో 8.2, ఆసియా పసిఫిక్ రీజియన్లో 7 శాతం వృద్ధి నమోదు చేసింది.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 9,840 మంది ఉద్యోగులు ఇతర సంస్థలకు వలస (అట్రిక్షన్) వెళ్లారు. ఇది గత 12 నెలల ప్రాతిపదికన తీసుకుంటే 21.5 శాతంగా ఉంటుంది. రెండో త్రైమాసికంలో అట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని టీసీఎస్ అంచనా వేసింది. ఈ నెల 18 షేర్ విలువ ప్రాతిపదికన వచ్చేనెల ఏడో తేదీన వాటాదారులకు షేర్పై రూ.8 రెండో ఇంటరిం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని రెగ్యులేటరీ ఫైలింగ్లో టీసీఎస్ తెలిపింది.