– కలెక్టర్ హనుమంతరావుకు పడమటిసోమారం రైతుల వినతి
బీబీనగర్, ఫిబ్రవరి 23 : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు ఆల్వా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావును కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నం.57లో ఉన్న సుమారు 5 ఎకరాలు 11 గుంటల ప్రభుత్వ భూమిని ఐకేపీ సెంటర్ కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామ పెద్దలు కలెక్టర్ను కలిసి తమ సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్య, ఉప సర్పంచ్ తంతరపల్లి ప్రదీప్ గౌడ్, గ్రామస్తులు వాకిటి బస్వరెడ్డి, గోరుకంటి బంగారయ్య, బద్దం భిక్షపతి, ఆల్వా యాదిరెడ్డి, వాకిటి ఆగిరెడ్డి, గుర్రం ఎల్లారెడ్డి, ఆల్వా అనంతరెడ్డి, కందడి రవీందర్ రెడ్డి, ఆకుల బసవయ్య, వాకిటి బసవరెడ్డి, బొమ్మగోని నాగేశ్వర్, బొమ్మగోని ప్రభు గౌడ్, మీసాల భాస్కర్, తలారి ఆంజనేయులు, గండు రాజు, ఆల్వా బలవంత రెడ్డి, ఆల్వా బాలకృష్ణారెడ్డి, మేగోటి ప్రవీణ్, జంగయ్య యాదవ్, దాసరి రమేష్, రామస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.

‘సర్వే నం.57 ప్రభుత్వ భూమిని ఐకేపీ సెంటర్కు కేటాయించాలి’