ములుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మవోయిస్టులు ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీగఢ్ రాష్ట్ర దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లోని సౌత్ బస్తర్ డీవీసీకి చెందిన ముచ్చకీ జోగా(25), అదే ప్లాటూన్ దళ సభ్యురాలు పూనమ్ బూద్రి (24) అనారోగ్యంతో బాధపడుతూ లొంగిపోయారని ఎస్పీ తెలిపారు. కరోనా సోకిన మావోయిస్టు పార్టీ సభ్యులు, ముఖ్య నాయకలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోలీస్ వారిని ఆశ్రయిస్తే వారికి మరుగైన చికిత్స అందిస్తామన్నారు.
వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతిఫలాలను అందజేస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ శోభన్ కుమార్, ఏఎస్పీ పి.సాయి చైతన్య, పస్రా సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు జి.రవీందర్, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు