ముంబై : బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు. బీజేపీలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తి గడ్కరీ ఒక్కరేనని, తన దృష్టిలో దివంగత బాలాసాహెబ్ ఠాక్రే స్ధాపించిన ఒకేఒక శివసేన మహారాష్ట్రలో ఉందని ఆమె పేర్కొన్నారు.
బాలా సాహెబ్ పార్టీ బాధ్యతలను ఉద్ధవ్కు అప్పగించారని, ఆయన బతికిఉండగానే ప్రస్తుతం నకిలీ సేనలు తయారయ్యాయని అన్నారు. స్వర్ణం, కాంస్యం మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని సుప్రియా సూలే చెప్పారు. అసలైన శివసేనపై ఓ ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ ప్రకటనను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో స్ధబ్ధత నెలకొందని, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ తీరును ఆమె తప్పుపట్టారు. మరాఠా రిజర్వేషన్లపై మరాఠా కోటా ఉద్యమకారుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 40 రోజుల డెడ్లైన్ ముగిసిన అనంతరం సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More :