Yash Raj Film | యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films). ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. అయితే ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్, ఇండియన్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కలిసి పని చేయనునున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ ఒప్పందంలో భాగంగా ‘ది రైల్వే మెన్'(The Railway Men), ‘మహారాజ్(Maharaj)’ అనే రెండు ప్రాజెక్ట్లను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్లను యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్ఫ్లిక్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘ది రైల్వే మెన్ (The Railway Men) ప్రాజెక్ట్ నుంచి నెట్ఫ్లిక్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
The story of humanity’s fight in the midst of a tragedy. #TheRailwayMen – a four episode series inspired by true stories arrives November 18, only on Netflix! pic.twitter.com/LcyIVZymbf
— Netflix India (@NetflixIndia) October 26, 2023
‘ది రైల్వే మెన్ 4 ఎపిసోడ్స్తో వెబ్ సిరీస్గా రాబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. దీనితో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తే.. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్, కే కే మీనన్, దివ్యేండు శర్మ, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ను శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1984 డిసెంబర్ 2-3 మధ్య రాత్రి వేళ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ దుర్ఘటన వలన సుమారు మూడు వేల మంది వరకు మరణించగా ఐదు లక్షలకుపైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఏండ్లగా బాధితులుగా మిగిలాయి. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు.