రాయికల్, ఏప్రిల్ 26: ప్రేమ ఎల్లలు దాటిం ది. దేశాలు దాటిపోయింది. శ్రీలంక అమ్మాయి, జగిత్యాల జిల్లా అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి (పడమర) గ్రామానికి చెందిన జోరిగె అశోక్, శ్రీలంక దేశానికి చెందిన సమన్వి అలియాస్ మరియా జోర్డాన్ దేశంలో పనిచేస్తున్నారు.
అకడే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలకు ఈ విషయం చెప్పగా, పెండ్లికి అంగీకరించారు. అయితే అశోక్ తల్లిదండ్రులు చనిపోవడంతో అక బావ శేఖర్, పూజిత పెండ్లిపెద్దలుగా వ్యవహరించారు. శుక్రవారం రాయికల్ మండ లం భూపతిపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా వివాహం జరిపించారు. వధూవరులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఆశీర్వదించారు.