కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25 : జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీలో సీట్లు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చెందిన పింగిలి వెన్నెల 27, రాపోలు శ్రీవాణి 601, మణిదీప్ రెడ్డి 952, ఓ రిశ్విక 986, కే రోహిత్ 1399, బీ హారిక 4359, ఈ సూర్యకాంత్ 10832, మాధవి జ్యోతిర్మయ 11592, పీ హాసిని 14317, కే శ్రీనిత్ 25121, ఎం శ్రీవిద్య 25539, పీ వర్షిణి 33892, ఆలిండియా ర్యాంకులు సాధించినందుకు అభినందనలు తెలిపారు.
60 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించి శ్రీచైతన్య మరో సంచలనం సృష్టించిందన్నారు. ఇక్కడ శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్ రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లెక్చరర్ల సహకారం, సరైన షెడ్యూల్తోనే నాకీ ర్యాంకు వచ్చింది. రమేశ్ రెడ్డి సార్తోపాటు డీన్ సార్, లెక్చరర్లు ఎప్పటికప్పుడు మార్కుల విషయంలో మమ్మల్ని ప్రోత్సహించారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తా. మంచి ఐఐటీ కాలేజీలో సీట్ సాధిస్తా.
– పింగిలి వెన్నెల, 27వ ర్యాంకు