హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న ఆఫ్టర్ నైన్ పబ్పై (After 9 Pub) పోలీసులు కేసు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్జోన్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 167 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యవతులు, 75 మంది యువకులు ఉన్నారు. కస్టమర్లను ఆకర్శించడానికి పబ్ నిర్వాహకులు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి యువతులను రప్పించినట్లు తెలుస్తున్నది.
పట్టుబడిన యువతకు డ్రగ్స్ డిటెక్ట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. యువతులను సైదాబాద్లోని రెస్క్యూహోమ్కు తరలించారు. వారంతా గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.