కుభీర్ : మహిళల ఆరోగ్యం ( Womens Health ) పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆకాష్ ( Doctor Ashok ) సూచించారు. మండల కేంద్రం కుభీర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ( PHC ) గురువారం సందర్శించారు. స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం మహిళల ఆరోగ్యంలో భాగంగా రక్తహీనత, మాతా, శిశు సంరక్షణ, మంచి పోషకాహారం, పరిశుభ్రత జీవన శైలిపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ తో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని తెలిపారు. అనంతరం హాస్పిటల్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షి, వైద్యులు విజయ్, వసుంధర, ఫార్మసిస్ట్ సల్ల ఆనంద్, రాధిక, ఏఎన్ఎమ్ లు, హెల్త్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.