లక్నో : ఢిల్లీలో ఆదివారం జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీ విజయవంతమైందని ఎస్పీ నేత శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో ప్రజలు, విపక్ష శ్రేణులు పోటెత్తారని సమాచారం అందిందని చెప్పారు.
దేశ రాజధానిలో విపక్ష కూటమి తలపెట్టిన భారీ ర్యాలీ విజయవంతం కావడం బీజేపీ ఓటమికి సంకేతాలు పంపుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని మీరట్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించారని, కానీ ధర్మేంద్ర యాదవ్ ఆరు నెలల నుంచే ప్రజల మధ్య ఉన్నారని చెప్పారు.
మరోవైపు మీరట్లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన నేతలపై తాను దర్యాప్తు జరిపించడమే కాకుండా దేశ ప్రజల సొమ్మును లూటీ చేసిన వారి నుంచి చోరీ సొత్తును రాబట్టి తిరిగి ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు.
Read More :