KCR Press Meet | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్మీట్లోనూ ఇదే రిపీట్ అయ్యింది. కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది.
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలో ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ ప్రసంగం మొదలయ్యిందో.. లేదో.. కరెంటు పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో.. ఇట్ల కరెంటు పోతా.. వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ అన్న మాట వినగానే సభ నవ్వులతో నిండిపోయింది. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.