హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. సిలబస్లో ఇకనుంచి 70 శాతమే ప్రత్యక్ష బోధన ఉండాలని, 30 శాతం ఆన్లైన్ బోధన నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆన్లైన్ బోధనలో పలు ఐఐటీలకు చెందిన ఫ్యాకల్టీల సేవలు వినియోగించుకోనున్నారు. 182 మంది సభ్యులతో కూడిన ‘బోర్డ్ ఆఫ్ స్టడీస్’ మూడు రోజుల సమావేశాలను వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
జేఎన్టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నిర్ణయాలు