IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. ఒమన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓపెనర్ అభిషేక్ శర్మ(38) విధ్వంసం కొనసాగించగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. దాంతో.. టీమిండియా అలవకోగా రెండొందలు కొడుతుందని అనుకున్నారంతా. కానీ, మిడిల్ ఓవర్లలో ఒమన్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే.. తిలక్ వర్మ(29), అక్షర్ పటేల్ (26) లు బౌండరీలతో హోరెత్తించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. దాంతో, సూర్యకుమార్ యాదవ్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి188 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(5) తొలి ఓవర్లో బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ, షాహ్ ఫైజల్ వేసిన రెండో ఓవర్లో బంతిని అంచనా వేయలేక క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (56) జతగా ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ(38). తనదైన పవర్ హిట్టింగ్ చేసిన అభి.. షకీల్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 16 రన్స్ పిండుకున్నాడు. నదీమ్ను ఉతికేస్తూ.. మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడీ లెఫ్ట్ హ్యాండర్. పవర్ ప్లే ఆఖరి బంతికి అతడు సిక్సర్ కొట్టడంతో స్కోర్ 60కి చేరింది. సంజూ సైతం గేర్ మార్చి ఏడో ఓవర్లో సిక్స్, ఫోర్తో రెచ్చిపోయాడు.
We are at the halfway mark and #TeamIndia have put on 100-3 on the board. Sanju Samson (37*) has hit some delightful shots and Axar is batting on 10. https://t.co/f821Q2KeZt #INDvOMA #AsiaCup2025 pic.twitter.com/FRunhcTzu9
— BCCI (@BCCI) September 19, 2025
అయితే.. రమాదిన్ ఓవర్లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అదే ఓవర్లో శాంసన్ ఆడిన బంతిని బౌలర్ రమాదిన్ చేతుల్ని తాకుతూ వికెట్లను గిరాటేయగా పాండ్యా నిరాశగా పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత వచ్చిన అక్షర్ పటేల్(26) కళ్లు చెదిరే షాట్లతో స్కోర్ బోర్డును ఉరికించాడు. సంజూతో కలిసి నాలుగో వికెట్కు 45 రన్స్ జోడించిన అక్షర్ను అమిర్ వెనక్కి పంపాడు. శివం దూబే(5) విఫలం కాగా.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లకు తిలక్ వర్మ() చుక్కలు చూపించాడు. అయితే.. అర్ధ శతకం తర్వాత శాంసన్, తిలక్ వరుసగా ఔట్ కావడంతో.. టీమిండియా రెండొందల మార్క్కు 12 పరుగుల దూరంలో ఆగిపోయింది.