IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ నామమాత్రపు పోరులో ఒమన్తో తలపడుతోంది. అంతర్జాతీయంగా ఏ ఫార్మాట్లోనైనా ఈ జట్టుతో టీమిండియాకు ఇదే తొలిమ్యాచ్. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
సూపర్ 4కు చేరినందున రెండు మార్పులతో ఆడుతున్నట్టు సూర్య తెలిపాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి బదులు హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. మరోవైపు ఒమన్ సైతం రెండు మార్పులతో ఆడుతోంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్కు ఇది 250వ మ్యాచ్.
𝘼 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙇𝙖𝙣𝙙𝙢𝙖𝙧𝙠 ✨#TeamIndia are set to play their 2️⃣5️⃣0️⃣th T20I (in Men’s Cricket) as they take on Oman in Abu Dhabi today! 👏#AsiaCup2025 | #INDvOMA pic.twitter.com/uod3RMNjAx
— BCCI (@BCCI) September 19, 2025
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఒమన్ తుది జట్టు : అమిర్ ఖలీం, జతిందర్ సింగ్(కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైజల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మొహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాత్సవ, జితేన్ రమానంది.