Viral news : పానీపూరి (Pani puri) ని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. పానీపూరి వాసన ముక్కుపుటాలను తగిలిందంటే.. ఎవరికైనా నోట్లో ఊరిళ్లు ఊరడం ఖాయం. పానీపూరి తిన్న తర్వాత పానీ తాగడం, స్వీట్ పానీపూరి తినడం అస్సలు మర్చిపోరు. ప్లేట్ పానీపూరి అడిగిన ఓ మహిళకు పానీపూరి అమ్మే వ్యక్తి కేవలం నాలుగు పానీపూరిలు మాత్రమే ఇవ్వడంతో తట్టుకోలేక చిన్నపిల్లలా వలవలా ఏడ్చింది.
గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఓ మహిళకు పానీపూరి తినేందుకు రోడ్డుపైకి వచ్చింది. పానీపూరి అమ్మే వ్యక్తికి రూ.20 ఇచ్చి ప్లేట్ పానీపూరి అడిగింది. కానీ అతడు ఆమెకు ఆరుకు బదులుగా కేవలం నాలుగు పానీపూరిలే ఇచ్చాడు. దాంతో ఆమె ఇంకో రెండు పానీపూరిలు ఇవ్వాలని పట్టుబట్టింది. కానీ.. అతడు ధరలు పెరిగాయని, కాబట్టి నాలుగే వస్తాయని చెప్పాడు. దాంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. దుఃఖం తట్టుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చుంది.
దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారణం తెలుసుకుని నివ్వెరపోయారు. స్థానికులతో కలిసి ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. పానీపూరిల కోసం ఓ మహిళ ట్రాఫిక్కు అంతరాయం కలిగించిందని తెలుసుకుని వాహనదారులు ఆమెపట్ల అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
वडोदरा के सुरसागर तलाब के बाद पास एक महिला कम पानीपुरी दिए जाने पर सड़क पर बैठ गई। महिला के बीच सड़क पर बैठने से वहां पर भीड़ जुटने लगी। जब लोगों ने महिला से बीच सड़क पर बैठने का कारण पूछा तो वह फफक कर रोने लगी। महिला ने बताया कि वह पानीपुरी खाने के लिए आई थी। पानीपुरी वाले ने 20… pic.twitter.com/y6rpZiQL1n
— NBT Hindi News (@NavbharatTimes) September 19, 2025