హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. 17,776 మంది రైతుల ఖాతాల్లో రూ.120.16 కోట్ల పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. ఇప్పటి వరకు 60.74లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందగా.. రూ.7,298.83 కోట్ల సాయం ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. వానాకాలం సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుండగా.. 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం అందుతుండగా.. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి రూ.5వేల చొప్పన సాయం ఖాతాల్లో జమ చేయనుంది.