నల్లగొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఉట్లపల్లి, యదగార్ పల్లి, కొత్తగూడెం, రాజగట్టు, గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి మంత్రి పల్లె ప్రకృతి వనాలను, వైకుంఠ ధామాలను, రైతు వేదికలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనులకు అనుగుణంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా అమలు అవుతున్నదన్నారు. పల్లెలు అభివృద్ధి కి ముఖ ద్వారాలుగా కనిపిస్తున్నాయని జగదీష్ రెడ్డి కితాబు ఇచ్చారు. ప్రతి గ్రామంలో పార్క్ లను తలపించేలా వైకుంఠ ధామాలు, ఆహ్లాదాన్ని పంచె ప్రకృతి వనాలు, గ్రామాలకు సరి కొత్త శోభను తెచ్చిపెట్టాయని అన్నారు.
ఇక సీఎం కేసీఆర్ మనసపుత్రికైనా హరితహారం కార్యక్రమంతో ప్రతి ఊరు పచ్చగా మారిందని, రహదారుల వెంట చెట్లు కనువిందు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతుల తలరాతలు మార్చే కరదీపికలుగా మారాయని అన్నారు. రైతులు కాలంతో పోటీ పడి, ఎకరాకు లక్ష రూపాయల ఆదాయాన్ని పొందేలా సకల విజ్ఞానాన్ని రైతు వేదికల ద్వారా పొంది, రైతులు చైతన్యవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు.
రైతు వేదికలు వ్యవసాయ రంగం లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ రాహుల్ శర్మ, పలువురు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ