హన్వాడ, మే 8 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. బుధవారం మండలంలోని మునిమో క్షం, వేపూర్, గొండ్యాల గ్రామాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మా ట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. మోసపూరిత మాటలతో మరోసారి ఓట్ల కోసం వ స్తున్నారని.. వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. పంటలు ఎండి, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క ఎ మ్మెల్యే కానీ.. మంత్రి కానీ పట్టించుకోలేద ని విమర్శించారు. కేసీఆర్ బస్సుయాత్ర మొదలు పెట్టగానే సీఎం రేవంత్కు వణుకు పుట్టి రైతుబంధు డబ్బులు జమచేస్తున్నాడన్నారు. అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. ఐదు నెలలైనా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కులమతాల పేరిట ఓట్ల రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మన్నెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మోసపూరిత మాటలు నమ్మొద్దని.. ఆలోచించి ఓటు వే యాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి సూచించారు. రైతులను సర్కారు ఆగం చేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. దేవుళ్లు, కులమతాల పేరిట ప్రచారం చేస్తున్న బీజేపీతో జాగ్రతగా ఉండాలన్నారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల కు నమ్మకం పోయిందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని, తనను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్విం డో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీలు శేఖర్, వెంకట్రాములు, నాయకులు లక్ష్మయ్య, బాల య్య, చెన్నయ్య, నరేందర్, రమణారెడ్డి, జంబులయ్య, శ్రీనివాసులు, ఖాజాగౌడ్, హరిచందర్ తదితరులు పాల్గొన్నారు.