జైపూర్ : అమెరికా-రష్యా నుంచి రాజస్థాన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేయనున్నది. ఇందుకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి టీకాలు వేయడానికి తగినంత టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాలు విదేశాల నుంచి గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గం వర్చువల్ సమావేశంలో కరోనా వ్యాక్సిన్ దిగుమతి కోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ఆమోదించారు. నాలుగైదు రోజుల్లో గ్లోబల్ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ, కోర్ గ్రూప్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫైజర్, రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు సంప్రదిస్తున్నారు. అయితే, టీకా దిగుమతుల కోసం గ్లోబల్ టెండర్లను ఉత్తర ప్రదేశ్ ఉపసంహరించుకున్నది.
సీరం ఇన్స్టిట్యూట్కు రాజస్థాన్ ప్రభుత్వం 3.75 కోట్ల వ్యాక్సిన్లను ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అందులో కేవలం ఒక శాతమే సరఫరా చేసినట్లు తెలుస్తున్నది. టీకా ఉత్పత్తి డిమాండ్ కంటే తక్కువగా ఉన్నందున, సీరం ఇన్స్టిట్యూట్ పెద్దమొత్తంలో సరఫరా చేసే స్థితిలో లేదు. అందువల్ల టీకాను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు చేపడితే బాగుంటుందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇతర దేశాల నుండి వ్యాక్సిన్లను పొందటానికి గ్లోబల్ టెండర్లను పిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ తీసి టీకా కొని రాష్ట్రాలకు పంపిణీ చేసి ఉంటే బాగుండేది అని ట్విట్టర్లో రాశారు. గెహ్లాట్ మాదిరి భావనను ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
విడిపోతే కష్టాలు ఎదుర్కొంటాం : అజీమ్ ప్రేమ్జీ
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..