న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ కలిగిస్తున్న వినాశనాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని నిరంతరం ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు కరోనా వ్యవహారాల రియల్ డాటాను కేంద్రం దాచిపెట్టిందని ఆరోపించింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం పొద్దుపోయాక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఉపాధి, అభివృద్ధి మాదిరిగా కరోనా వైరస్ యొక్క నిజమైన గణాంకాలను ప్రజలకు చేరడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. దేశంలోని పౌరులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను వర్తింపజేయాలన్న డిమాండ్ను కాంగ్రెస్ నాయకుడు పునరుద్ఘాటించారు.
కరోనా వైరస్పై దేశీయ, విదేశీ మీడియాలో అడిగిన ప్రశ్నల దృష్ట్యా.. కాంగ్రెస్ నాయకుడు ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఉపాధి, అభివృద్ధికి సంబంధించి నిత్యం ఏదో విషయాలు లేనివి ఉన్నట్లుగా వల్లెవేస్తుంటారు. ఇదే మాదిరిగా కరోనా యొక్క రియల్ డాటాను ప్రజలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తున్నది. కరోనా టీకాలను దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించాలి ‘ అని రాహుల్గాంధీ డిమాండ్ చేశారు.
కేంద్రం తన ఇమేజీని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నదే కానీ, ప్రజల ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారత్ను బీజేపీ వ్యవస్థకు బాధితులుగా చేయవద్దని కోరుతున్నా అని పేర్కొన్నారు.
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
అమెరికా నుంచి ఢిల్లీకి చేరిన 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
భారత్కు ఆక్సిజన్, వెంటిలేటర్, పీపీఈ కిట్లు పంపనున్న ఆస్ట్రేలియా
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..