Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అండగా నిలవాలని ఓటర్లకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగే ఎన్నికలని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియో సందేశంలో రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపు ఇచ్చారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్లు ప్రయత్నిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ, విపక్ష ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్నాయని వివరించారు. తాము ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేశామని, మణిపూర్ నుంచి ముంబై వరకూ పర్యటించామని రాహుల్ గుర్తుచేశారు.
తాము మేనిఫెస్టోలో ప్రజల అభ్యున్నతికి ఐదు గ్యారంటీలను పొందుపరిచామని చెప్పారు. నరేంద్ర మోదీ దేశానికి 22-25 మంది మిలియనీర్లను తయారుచేస్తే తాము కోట్లాది మహిళలు, యువతను లక్షాధికారులుగా మలుస్తామని, రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. తమ విప్లవాత్మక మేనిఫెస్టోను ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన వీడియో సందేశంలో ఓటర్లను కోరారు.
Read More :
BJP | పెద్దపల్లి జిల్లా బీజేపీలో భగ్గుమన్న విభేదాలు.. నామినేషన్ సందర్భంగా కొట్టుకున్న నేతలు