Loksabha Elections 2024 | ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులకు బెయిల్ మంజూరయ్యేలా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేవారని, తమ మాట వినని అధికారులను సస్పెండ్ చేసేవారని ఆరోపించారు. ఓటు బ్యాంక్ను కాపాడుకునేందుకు బుజ్జగింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేసేవారని ప్రధాని మండిపడ్డారు.
యూపీలోని ధౌరహ్రాలో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్-ఎస్పీ యువరాజుల రాజకీయ మనుగడకు సంతుష్టీకరణ తప్పనిసరిగా మారిందని దుయ్యబట్టారు. ముస్లిం ఓటు బ్యాంక్ను కాపాడుకునేందుకు వీరు బాహాటంగా సంతుష్టీకరణకు తెగబడుతున్నారని అన్నారు.
ఇక అంతకుముందు యూపీలోని ఇటావాలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. కానీ కాంగ్రెస్, ఎస్పీలు తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్పైనే దృష్టి సారిస్తాయని ఆరోపించారు.
Read More :
Murder | ఇసుక మాఫియా అరాచకం.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య..!