Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నానని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చెప్పారు.
మూడో దశలో ఎస్పీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి మొయిన్పురి నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తానని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. ఎస్పీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ అని చెప్పారు.
ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Cable bridge | కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే పార్టీ.. వివాదంలో మాదాపూర్ సీఐ