న్యూఢిల్లీ : లడఖ్లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. జమ్ము కశ్మీర్ పర్యటనలో భాగంగా లడఖ్ను సందర్శించిన రాహుల్ చైనా లడఖ్లో భూభాగాన్ని తీసుకున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఒక్క అంగుళం భూమి కూడా డ్రాగన్ పరం కాలేదని చెబుతున్నారని ఇది అవాస్తవమని అన్నారు.
చైనా సైన్యం ఈ ప్రాంతంలోకి వచ్చి కొంత భూమిని స్వాధీనంలోకి తీసుకుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. తూర్పు లడఖ్లో భారత్, చైనా సేనలు గత మూడేండ్లుగా ఘర్షణ పడుతుండటంతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొంది. 2020 జూన్లో ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి.
ఇక లడఖ్ను సందర్శించిన రాహుల్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు తమకు కల్పించిన ప్రతిపత్తిపై సంతృప్తిగా లేరని చెప్పుకొచ్చారు. వారు తమ ప్రాతినిధ్యం కోరుకుంటున్నారని రాష్ట్రాన్ని అధికారులు కాకుండా ప్రజా ప్రతినిధులు పాలించాలని కోరుకుంటున్నారని అన్నారు. లడఖ్లో పర్యటించిన రాహుల్ శనివారం ప్యాంగాంగ్ సరస్సుకు బైక్పై చేరుకున్నారు. ప్యాంగాంగ్ నదీ తీరాన రాహుల్ గాంధీ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
Read More :
Actor Rajinikanth | అఖిలేష్ యాదవ్, నేను మంచి స్నేహితులం, తరచూ ఫోన్లో మాట్లాడుకుంటాం: రజినీకాంత్