లక్నో: స్టార్ హీరో రజినీకాంత్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్ నివాసానికి వెళ్లిన రజినీకాంత్ను ఆయన సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం అఖిలేష్ నివాసం నుంచి బయటికి వచ్చిన రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు.
అఖిలేష్ యాదవ్ను తాను తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్లో కలిశానని, అప్పటి నుంచి తామిద్దరం స్నేహితులమయ్యామని రజినీ చెప్పారు. ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకుంటామని అన్నారు. ఐదేళ్ల క్రితం కూడా తాను ఓ సినిమా షూటింగ్ కోసం లక్నోకు వచ్చానని, కానీ అతను లక్నోలో లేకపోవడంతో కలవలేకపోయానని అన్నారు. ఇప్పుడు ఆయన లక్నోలోనే ఉన్నాడని తెలుసుకుని కలిశానని చెప్పారు.
#WATCH | Lucknow, UP: “I met Akhilesh Yadav 9 years ago at a function in Mumbai and we are friends since then, we talk on phone. 5 years ago when I came here for a shoot but I couldn’t meet him, now he is here so I met him…”: Actor Rajinikanth after meeting SP Chief Akhilesh… pic.twitter.com/QWAeG3306d
— ANI (@ANI) August 20, 2023