రామగిరి, ఫిబ్రవరి 02 : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, గౌరవ అధ్యక్షుడు టి.సత్తయ్య, వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకులు విజయకుమార్ రెడ్డి, మారం వెంకట్ రెడ్డి, డి.కళావతి, పోలె వెంకటయ్య, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ పాషా, కొర్ర లోక్యా నాయక్, పుల్లయ్య, సైదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వలి బాషా, రమేష్, రవీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.