న్యూయార్క్ : ప్రముఖ నటి ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు రూ.22 కోట్లు నిధులు వసూలు చేశారు. ఫండ్ రేజర్ ద్వారా ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు వారు తెలిపారు. తన మాతృదేశంలో కరోనా బారినపడి ఇబ్బందిపడుతున్న ప్రజలకు తమ వంతుగా ఈ నిధిని ఖర్చు చేయనున్నట్లు వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
గివ్ ఇండియాతో కలిసి ప్రియాంక-నిక్ ఈ నిధిని సేకరించారు. ఈ నిధిని భారతదేశంలో కొవిడ్-19 ను ఎదుర్కోవటానికి సహాయపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ డబ్బును ఎక్కడ ఉపయోగించాలో చూడాలని గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాను ప్రియాంక కోరింది.
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ సేకరించిన నిధిని భారత్లో ఆక్సిమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజా.. ప్రియాంకతో జరిపిన వీడియో సంభాషణలో తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని చెప్పారు.
ఇలాఉండగా, ఆపదలో ఉన్న భారత్కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కోరినట్లు ప్రియాంక చోప్రా తెలిపారు. భారత్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్కు చెప్పినట్లు ప్రియాంక పేర్కొన్నారు.
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..