ఖలీల్వాడి, మే 7: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, గంటన్నరకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కేసీఆర్ సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు.
అయితే, కేసీఆర్ బస చేసిన ప్రాంతంలో సుమారు గంటన్నరపాటు కరెంట్ పోయింది. జనరేటర్ అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విద్యుత్తు ఎస్ఈకి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇది కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.