Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రోజుకో అంశంతో ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. మధ్యప్రదేశ్లోని బెతుల్లో బుధవారం జరిగిన ర్యాలీలో ఓబీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీరును మోదీ దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో ఏపీలో ఆ పార్టీ తొలుత మత ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.
అప్పట్లో కాంగ్రెస్ తన ప్రయత్నాల్లో పూర్తిగా విజయవంతం కాలేదని అన్నారు. మళ్లీ అదే గేమ్ను మరోసారి ప్రయోగించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీ కోటా కింద కర్నాటకలో ఓబీసీలు పొందే రిజర్వేషన్ కోటాకు కత్తెర వేసేందుకు ముస్లింలందరినీ ఓబీసీ కోటాలో చేర్చిందని వివరించారు.
కాంగ్రెస్ చేపట్టిన ఈ చర్య దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు హెచ్చరిక సంకేతం వంటిదని ప్రధాని పేర్కొన్నారు. ఇక అంతకుముందు రాష్ట్రంలోని సాగర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వారసత్వ పన్నును తెరపైకి తీసుకువస్తోందని విమర్శించారు. తల్లితండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించే ఆస్తిపై పన్ను విధించాలని ఆ పార్టీ సలహాదారు సూచించారని చెప్పారు.
Read More :