Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతుండగా తాజాగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఎదురైంది. బినా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే ఆదివారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. పార్టీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.
మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీలో చేరుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ను వీడటం ఆ పార్టీ అగ్రనేతలను కలవరపరుస్తోంది.
Read More :
Snakes | ప్యాంటులో పాములు.. ఎయిర్పోర్టులో పట్టుబడిన ప్రయాణికుడు