న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం మళ్లీ పైకి కదిలాయి. ఇంతకు ముందు మంగళవారం రేట్లను చమురు కంపెనీలు పెంచగా.. ఒక రోజు విరామం తర్వాత మళ్లీ పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి దేశవ్యాప్తంగా ఇంధన ధరలు చేరాయి. తాజాగా పెట్రోల్ లీటర్కు 24 పైసలు, డీజిల్ లీటర్కు 29 పైసల వరకూ పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.68, డీజిల్ లీటర్ రూ.84.61కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. పెట్రోల్ రూ.99.94, డీజిల్ లీటరుకు రూ.91.87కు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.32కు చేరింది.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. ఈ నెలలో ఇప్పటి వరకు 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 2న వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్పై రూ.3.33, డీజిల్పై రూ.4 వరకు ధర పెరిగింది. అత్యధికంగా రాజస్థాన్ శ్రీగంగానగర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.104.67కు అమ్ముడవుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో ధరలు
ఢిలీల్లోలో రూ.93.68, డీజిల్ లీటర్కు రూ.84.61
ముంబైలో పెట్రోల్ రూ.99.94, డీజిల్ లీటర్కు రూ.91.87
చెన్నైలో పెట్రోల్ రూ.95.28, డీజిల్ లీటర్కు రూ .89.39
కోల్కతాలో పెట్రోల్ రూ.93.72, డీజిల్ లీటర్కు రూ.87.46
భోపాల్లో పెట్రోల్ రూ.101.77, డీజిల్ లీటర్కు రూ.93.07
లక్నోలో పెట్రోల్ రూ.91.21, డీజిల్ లీటర్కు రూ.85
బెంగళూరులో పెట్రోల్ రూ.96.80, డీజిల్ లీటర్కు రూ.89.70
పాట్నాలో పెట్రోల్ రూ.95.85, డీజిల్ లీటరుకు రూ.89.87
జైపూర్లో పెట్రోల్ రూ.100.17, డీజిల్ లీటర్కు రూ .93.36
హైదరాబాద్లో పెట్రోల్ రూ.97.52, డీజిల్ లీటర్కు రూ.92.32