రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన పర్యటించి యావాపూర్ ఐకేపీ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని, ఘనపూర్లోని వీరభద్ర రైస్మిల్లును తూప్రాన్ పట్టణంలోని ఒకటవ నెంబర్ రేషన్ దుకాణాన్ని, రామాయంపేటలోని మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులు వరి కి ప్రత్నామ్మాయంగా వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలని సూచించారు. కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. తూకంలో అవకతవకలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రామయంపేట/తూప్రాన్, మే 14: దేశంలోనే ఎక్క డా లేనివిధంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి తెలిపారు. శనివారం రామాయంపేటకు విచ్చేసిన ఆయన పట్టణంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు. అనంతరం తూప్రాన్ మండలం యావాపూర్ ఐకేపీ సెంటర్లోని కొనుగోలు కేంద్రాన్ని, ఘనపూర్లోని వీరభద్ర రైస్మిల్లును, తూప్రాన్లోని ఒకటో నంబర్ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గోవర్ధన్రెడ్డి, శారద, భారతితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు లాభం చేకూర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే రాష్ట్రంలో పల్లెపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
ధాన్యం సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెట్ కమిటీలతో ధాన్యం సేకరిస్తున్నదన్నారు. టార్పాలిన్లు, గోనె సంచులను ప్రభుత్వం సకాలంలో అందిస్తున్నదన్నారు. రైతుల ఇబ్బందులు గుర్తించేందుకు టాస్కుఫోర్సు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో సాయిరాం, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తూప్రాన్ ఎంపీడీవో అరుంధతి, డీసీవో కరుణ, డీఎస్వో శ్రీనివాస్, ఏవో రాజ్నారాయణ, డీఈవో శ్రీనివాస్, ఆర్ఐ రాజు, సీఈవో నర్సింహులు, వ్యవసాయాధికారిణి సింధు, యావాపూర్ ఎంపీటీసీ సంతోష్రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ హనుమంతు పాల్గొన్నారు.