మామిళ్లగూడెం, ఏప్రిల్ 18: ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో తొలి రోజు గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. ఆదార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కాగా, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ రెండు మూడు రోజుల్లో తమ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.