కైరో: అంతర్జాతీయ నీటి రవాణాకు ముఖ్యమైన సూయెజ్ కాలువలో పడవలు నిలిచిపోకుండా ఇప్పడు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రణాళిక గురించిన సమాచారాన్ని ఈజిప్ట్ వెల్లడించింది. మార్చి నెలలో సూయెజ్ కాలువలోని ఇరుకైన ప్రదేశంలో పెద్ద ఓడ ఎవర్ గివెన్ చిక్కుకున్న సంఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సూయజ్ కెనాల్ అథారిటీ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ, సూయెజ్ నగరమైన ఇస్లామియాలో జరిగిన ఒక కార్యక్రమంలో విస్తరణ ప్రణాళిక గురించి పూర్తి సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతే అల్-సీసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ కాలువ ఇప్పటి వరకు 66 అడుగులు మాత్రమే ఉండగా, ఇప్పుడు దానిని 72 అడుగులు లోతుగా చేసే ప్రణాళికలు ఉన్నాయని ఒసామా రబీ చెప్పారు. అదేవిధంగా సూయెజ్ కాలువ పొడవును కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. 2015 లో తెరిచిన రెండవ పాసేజ్ ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పొడవును మాత్రమే కలిగి ఉన్నది. ఈ పొడవును మరో 10 కి.మీ విస్తరించనున్నారు. రెండు దారులు ఇప్పుడు 82 కి.మీ. ఉంటున్నందున ఓడలు ఇరుక్కుపోయే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు.
పనామా నియంత్రణలో ఉన్న జపాన్ ఓడ ఎవర్ గివోన్ మార్చిలో సూయెజ్ కాలువలో చిక్కుకుపోయింది. ఈ కారణంగా ఆరు రోజులపాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోంది. ప్రపంచ వాణిజ్యంలో 10 శాతం ఈ కాలువ గుండా వెళ్లే ఓడల ద్వారా జరుగుతుంది. గత ఏడాది సూయెజ్ కాలువ గుండా 19 వేలకు పైగా నౌకలు ప్రయాణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..