భిన్న సంస్కృతులు, మతాలు సంగమించే పవిత్ర భూమి భారతదేశం. వివిధ మతాలు, కులాలు, భాషలు, జాతులు, భౌగోళిక ప్రాంతాలు, సంస్కృతులకు చెందినప్పటికీ మనమంతా ఒక్కటే అనే సామాజిక, మానసిక భావన అందరిలోనూ ఉంది. భారతీయ సమాజం భిన్నత్వానికి అద్దం పడుతుంది. ఇంతటి పేరుగాంచిన దేశం.. ప్రస్తుతం కొంతమంది స్వార్థపరుల రాజకీయాలకు బలవుతున్నది. వారి పైశాచికత్వం కోసం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ ప్రజానీకం, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా పాలన కొనసాగుతున్నది. మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కీర్తిగడిస్తున్నది. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని సబ్బండవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీర్కూర్, సెప్టెంబర్ 22: కులమతాలకు అతీతంగా పాలన సాగించాలి. అందరినీ కలుపుకొని వెళ్లే పాలకుడు ఉండాలి. కరువు కాటకాలు, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం లాంటి సమస్యలను పరిష్కరించగల దమ్మున్న నేత కావాలి. ప్రస్తుతం దేశ ప్రజల కాంక్ష ఇది. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధికి మారుపేరుగా నిలిచింది. ప్రజల ఆకాంక్ష కోసం పోరాడిన ఉద్యమనేత, రైతుల రాతను మార్చిన నాయకుడు, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశం పిలుస్తున్నది. సీఎంగా రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న కృషిని యావత్ దేశం గమనిస్తున్నది.
అన్ని మతాలనూ గౌరవిస్తూ.. అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తూ అందరివాడిగా ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని సబ్బండవర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్ స్థాయికి తీసుకొచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్. రాష్ట్రం వచ్చిన నాటి నుంచే దేవాలయాలు, మసీదులు, చర్చీలను సుందరంగా తీర్చిదిద్ది అన్నిమతాలను గౌరవిస్తున్నారు. ధూప దీప నైవేద్యాల పథకం, పూజారులు, మసీదుల ఇమామ్, మౌజమ్లకు ప్రతి నెలా గౌరవభృతి అందజేస్తున్న ముఖ్యమంత్రులు దేశంలో ఎక్కడా లేరు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలన్నీ ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా చెప్పవచ్చు. మత విద్వేషాలు, కులాల కొట్లాటకు తావులేకుండా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఇలాంటి నాయకుడి సేవలు దేశానికి ఎంతో అవసరమని అన్నిమతాల వారూ అభిప్రాయ పడుతున్నారు. త్వరలో కేసీఆర్ ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి మద్దతు పలుకుతామని ప్రకటిస్తున్నారు.
దేశం బాగుపడుతుంది..
బీర్కూర్ : కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ మాదిరిగా దేశం కూడా బాగుపడుతుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో సంక్షేమ పథకాలతోపాటు దేవాలయాల అభివృద్ధికి సీఎం చాలా కృషి చేశారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే దేశంలోని ఆలయాలతోపాటు, ప్రజలు, రైతులు సైతం సుఖ సంతోషాలతో ఉంటారు. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా హాయిగా బతుకుతారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే.
– నాగభూషణమప్ప, పురోహితుడు,దామరంచ, బీర్కూర్ మండలం
కులమతాలతో రాజకీయం చేయరు..
బీర్కూర్, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ కుల మతాలతో రాజకీయం చేయరు. ఆయనకు అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు.. రెండు కండ్లలాంటివి. తెలంగాణ తెచ్చిన నుంచి ప్రజలు, రైతులను ఎలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే పనిచేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తారు. అందులో భాగంగానే ఆలయాలు, చర్చీలు, మసీదులను నిర్మించారు. దేశాన్ని పాలించేందుకు ఇలాంటి వ్యక్తి ఒక్కరుంటే చాలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తే దేశం ప్రశాంతంగా ఉంటుంది.
–మంద జోసెఫ్, పాస్టర్,ఐపీసీ చర్చి, బీర్కూర్.
ఇండియా లెవల్ పార్టీ లగాయింగే కేసీఆర్ సాబ్ హరేక్కో ఫాయిదా హోయింగా..
బీర్కూర్ : హమారే తెలంగాణ సీఎం కేసీఆర్ సాబ్ జో ముష్కిల్ జబ్దో జహద్ కర్కే తెలంగాణ హసీదియేహై. అప్నీ పూరీ మెహనత్ ఔర్ కోషిద్కే సాత్ తెలంగాణకు పూరీ తరీఖాకే సాత్ ఆగే లేకర్ జా రహేహై. బిలా మజాబో మిల్లక్ హర్ ఏక్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్క్ ఇసాయి సబ్కు సాత్ లేకర్ చల్ రహేహై. ఔర్ తెలంగాణ స్టేట్ మే టీఆర్ఎస్ పార్టీ హరేక్కా వికాస్ తర్కీ హోరహీహై. హమ్ కేసీఆర్ సాబ్ సే హమ్ జో హై ఆప్కీ హిమ్మత్ అప్జాయీ కర్తే హై. ములుగ్కీ పూరే ఆల్ ఇండియా లెవల్ పర్ అప్నే పార్టీ లగాకర్ కే సారీ హిందుస్థాన్ కీ హమారే ముల్క్ భారత్కీ హర్ ఏక్కీ తరీఖీ జోహై హమారా తెలంగాణ మే జో స్కీమాహై హర్ఏక్కా ఫాయిదా హోయేగా. హిందూ, ముస్లిం సబ్కా ఫాయిదా హోయేగా. ఇసీ వాస్తే ఇండియా లెవల్ పార్టీ లగాయింగే.. కేసీఆర్ సాబ్ హర్ ఏక్ ఫాయిదా హోయింగా.
-అబ్దుల్ ఖదీర్, పేష్ ఇమామ్, జామా మసీద్, బీర్కూర్
కులమతాలకు అతీతంగా పథకాలు..
బాన్సువాడ టౌన్ : జాతీయ రాజకీయాల్లో గొప్ప మార్పు రావాలంటే కేసీఆర్ లాంటి ముందుచూపు ఉన్న నాయకులు అవసరం. దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రిస్మస్ పండుగకు ఇంటి పెద్దగా ప్రతి క్రైస్తవ కుటుంబానికి కొత్త బట్టలు పెట్టడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి కులమతాలకు అతీతంగా అందుతున్నాయి. అందుకే ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను.
-టి. ఏసుదాస్, పాస్టర్ సీఎస్ఐ చర్చ్, బాన్సువాడ
ప్రత్యామ్నాయం కేసీఆరే..
నస్రుల్లాబాద్ :బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయం కేసీఆరే. దక్షిణాది నుంచి దేశ్కి నేతగా మారుతుండడం శుభ పరిణామం. మతాల పేరిట చిచ్చు పెట్టే పాలకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయవచ్చు.
– అజాం ఖాన్, ఇమామ్, నస్రుల్లాబాద్
పురాతన ఆలయాల అభివృద్ధి..
బాన్సువాడ టౌన్: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామానికీ కొత్త ఆలయాలు మంజూరు చేస్తూ నిర్మింపజేశారు. దీంతో బ్రాహ్మణులకు చేయూతనందించారు. దేశంలో మరెక్కడా లేని ప్రాధాన్యతను తెలంగాణలో బ్రాహ్మణులకు కల్పించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేసి ఉదారతను చాటుకున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే అన్ని కులాల వారికి ప్రాధాన్యతతోపాటు సౌలభ్యం లభిస్తుంది.
-సరఫ్ ఆకాశ్ శర్మ, అర్చకులు,పెద్ద హనుమాన్ మందిరం బాన్సువాడ
అన్నిరంగాలపై అవగాహన ఉన్న నేత…
నస్రుల్లాబాద్ : సీఎం కేసీఆర్కు అన్నిరంగాలపై అవగాహన ఉన్నది. స్వరాష్ట్రంలో అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి నేడు దేశంలోనే అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా పేరు సాధించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి అన్ని అర్హతలు ఉన్న కేసీఆర్ అరంగేట్రం చేస్తుండడం నిజంగా శుభ పరిణామం.
– భరద్వాజ నారాయణరావు, పూజారి, నస్రుల్లాబాద్
ఆర్థిక స్థితిగతులు మారుతాయి..
నస్రుల్లాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎనిమిదేండ్ల కాలం లో ప్రతీ కుటుంబానికి ఏదోవిధంగా లబ్ధి చేకూర్చారు. ఇలాంటి మహోన్నత వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి వస్తే మన దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉంది. – ధూళిపాల థామస్, పాస్టర్, బొమ్మన్దేవ్పల్లి
కేసీఆర్ వస్తే.. అంతటా మన పథకాలు..
బాన్సువాడ టౌన్: జాతీ య రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అత్తగారిది మహారాష్ట్ర పరిధిలోని మర్కెల్. వాళ్లది రైతు కుటుం బం. మన రాష్ట్రంలో రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు వాళ్లకు లేవు. అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులు చెప్పలేనివి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వ స్తే మన దగ్గర అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు మహారాష్ట్రలో కూడా అమలవుతాయని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. జాతీయ నాయకుడిగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు.
– ఫారూక్,మహమ్మదీయ మజీద్, సంగమేశ్వర కాలనీ చౌరస్తా, బాన్సువాడ