టాలీవుడ్ యువ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy)నైజాం డిస్ట్రిబ్యూషన్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తుల్లో ఒకరని తెలిసిందే. ఇటీవలే నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ యాక్షన్ థ్రిల్లర్గా కమల్ హాసన్ (kamal haasan) నటిస్తోన్న విక్రమ్ (vikram)తెలుగు రైట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్కు ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సుధాకర్ రెడ్డి ఇవాళ కమల్హాసన్ను చెన్నైలో కలిశారు. సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్ కు సంబంధించిన అంశాలపై కమల్హాసన్తో చర్చించినట్టు సమాచారం.
అంతేకాదు కమల్ హాసన్కు విక్రమ్ తెలుగు పోస్టర్ ఫ్రేమ్ను అందించారు. తాజా టాక్ ప్రకారం హైదరాబాద్లో విక్రమ్ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా..ఈవెంట్కు కమల్ హాసన్ కూడా హాజరవబోతున్నాడట. ప్రమోషనల్ ఈవెంట్కు చిత్రయూనిట్తోపాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనుంచి పలువురు ప్రముఖులు రానున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఖైదీ ఫేం లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేస్తున్నారు. మరో స్టార్ యాక్టర్ సూర్య కీ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ జూన్ 3న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది.