టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే మోహన్ రాజా డైరెక్షన్లో చేస్తున్న గాడ్ ఫాదర్ (Godfather) చిత్రీకరణ దశలో ఉంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ కూడా సెట్స్ పైకి వెళ్లింది. కాగా ఇపుడు మరో క్రేజీ అప్ డేట్ మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. బాబీ (Bobby) డైరెక్షన్లో చిరు 154 ప్రాజెక్టు చేస్తన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేటే ఇపుడు బయటకు వచ్చింది.
మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ను జూన్ 5 నుంచి షురూ చేసేందుకు రెడీ అవుతుందట బాబీ టీం. తాజాగా ఫిలింనగర్లో రౌండప్ చేస్తున్న టాక్ ప్రకారం మలేషియాలో 3 వారాలపాటు ఈ షెడ్యూల్ను కొనసాగించున్నారట. ఈ మూవీలో శృతిహాసన్ లీడింగ్ హీరోయిన్గా నటిస్తోంది. అందాల బ్యూటీ కేథిరన్ ట్రెసా, సముద్రఖని, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంతో డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య పాత్రలో చిరంజీవిలోని మాస్ యాంగిల్ను చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు చూపించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.