– పోలీసుల అప్రమత్తతతో పరారైన దుండగుడు
భువనగిరి అర్బన్, ఆగస్టు 07 : భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు ప్రయత్నించాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న భువనగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకోగా, పోలీసులను గమనించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్ తెలిపారు.