న్యూఢిల్లీ : సిక్కింలో దాదాపు వంద మంది బౌద్ధ సన్యాసులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. గాంగ్టక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రుమ్టెక్ ఆశ్రమంలోని ధర్మచక్ర కేంద్రం నుంచి కనీసం 37 మంది బౌద్ధ సన్యాసులు వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. 61 మందిపైగా కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేయగా.. సిక్కింలోని గుంజాంగ్ మోనాస్టరీని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేసిన బౌద్ధ సాధువులను సరంసా గార్డెన్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
ఈ సందర్భంగా గాంగ్టక్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాబిన్ మాట్లాడుతూ ఆశ్రమంలో, వెలుపల కదలికలను పరిమితం చేసేందుకు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆశ్రమంలో ఇతర సాధువుల కాంటాక్ట్లను గుర్తించడంతో పాటు పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య సిక్కిం ప్రభుత్వం లాక్డౌన్ను మరో వారం పొడగించింది. ఆదివారం సిక్కింలో 324 కొవిడ్ కేసులు నమోదవగా.. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 13,132కు పెరగ్గా.. మొత్తం 224 మంది మృత్యువాతపడ్డారని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం 3,317 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు 9,381 మంది బాధితులు కోలుకున్నట్లు చెప్పింది.