న్యూఢిల్లీ : అంగారకుడి ఆకాశంలో మేఘాలను నాసా క్యూరియాసిటీ రోవర్ చూసింది. రోవర్ పంపిన మేఘాల చిత్రాలను చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులవుతున్నారు. అంగారకుడి వాతావరణంలో ఇలా మేఘాలు చూడటం చాలా అరుదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాసా ప్రకారం, అంగారకుడిపై ఇటువంటి మేఘాలు సంవత్సరంలో అత్యంత శీతల రోజుల్లో దాని భూమధ్యరేఖకు పైన కనిపిస్తాయి. ఈ రేఖ ఊహాత్మకమైనది. దాని అక్షం మీద అంగారక భ్రమణం ప్రకారం స్థిరంగా ఉంటుంది.
క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల్లో మార్స్ మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాసా ప్రకారం, ఈ మేఘాలు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. కొన్నింటిలో వేర్వేరు రంగులు కూడా కనిపించాయి. క్యూరియాసిటీ ద్వారా నాసా గుర్తించిన మేఘాలు చాలా ఎత్తులో ఉన్నాయి. అంగారక గ్రహంపై కనిపించే మేఘాలు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. వాటిలో నీరు, మంచు కూడా ఉంటుందని భావిస్తున్నారు. మంచు గడ్డకట్టడం వల్ల లేదా కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోవడం వల్ల ఇది జరిగి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేఘాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఈ ఫొటోలు వెలువడిన అనంతరం అంగారక గ్రహం మీద శీతాకాలం గురించి కూడా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. నాసా పంపిన ఈ రోవర్ అంగారక గ్రహం మీద దాదాపు రెండేండ్లుగా ఉన్నది.
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..