సారంగపూర్ : ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గీత కార్మికులకు ( Toddy Tappers ) ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యాలు ( Subsidi ) ఇచ్చి జీవన ఆధారం కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) కోరారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట, పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు ,దీవెనలు గీత కార్మికుల పైన ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.అన్నింటి కన్నా ప్రమాదకరమైన వృత్తి గౌడ సోదరుల గీత వృత్తి అని,గీత కార్మికులకు ఈత వనానికి 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులతో గౌడ సోదరుల వృత్తికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరారు.