ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లోనే ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి ఈ జరిమానా విధించడం విశేషం. దీనిని తొలి నేరంగా పరిగణించి జరిమానాతో వదిలేశారు. ఈ మ్యాచ్లో ధోనీ డకౌటైన విషయం తెలిసిందే. 2015 తర్వాత చెన్నై టీమ్ తరఫున ధోనీ డకౌటవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో చెన్నైకి సానుకూల అంశం ఏదైనా ఉందంటే అది సురేశ్ రైనా ఫామ్లోకి రావడమే. గతేడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్కు దూరమైన రైనా.. ఈసారి వచ్చీ రాగానే దంచికొట్టాడు. తన ఫామ్, ఫిట్నెస్పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.