హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ.. ఓ సందేశాత్మక వీడియోను రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
కొవిడ్ వంటి మహమ్మారి నుంచి మన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రేరణ నిజంగా అవసరమా? అని ప్రశ్నిస్తూ.. దివ్యాంగులు మాస్కు ధరిస్తున్న వీడియోను షేర్ చేశారు. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ సమయంలో మన కుటుంబ సభ్యులతో పాటు ఇతరులను కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా అవసరమైన నిబంధనలు పాటించాలి. మాస్కును ధరించడం తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అని ఎంపీ సంతోష్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాళ్లు, చేతులు, కండ్లు లేకున్నప్పటికీ వారు మాస్కు ధరించి కరోనాను దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. కరోనాను తరిమికొట్టాలనే సందేశాన్ని సంతోష్ కుమార్ ఇచ్చారు.
Do we really need an inspiration to save ourselves from a pandemic like COVID? Man! It’s surging again! Need to be very careful for the sake of our family and others around us. Comply with all the necessary protocols. WearingMask is mandatory, else your negligence will cost a lot pic.twitter.com/21CAKMDmL5
— Santosh Kumar J (@MPsantoshtrs) April 1, 2021
ఇవీ కూడా చదవండి..