హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పెద్దల సూచన మేరకు, పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్ నామినేషన్లో పాల్గొన్నాం. ఈరోజు ,రేపో పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar )అన్నారు. కరీంనగర్లోని ఇందిరా భవన్లో డీసీసీ అధ్యక్షుడు, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) వెన్నులో వణుకు పుడుతోందనికాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం బాధాకరమన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడారని మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్య పాలనపై ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోసింగ్ మాట్లాడిన వీయోడును వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పరిపాలించింది. ప్రజలంతా గమనించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరమన్నారు.