హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ అనుచరులతో గులాబీ గూటికి చేరారు. వారితోపాటు నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపీటీసీ మంజుల, గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ తదితరులు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై పెరిగిన విశ్వసనీయతకు తాజా చేరికలు అద్దం పడుతున్నాయాన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లోకి వలసల ప్రవాహం కొనసాగుతున్నాయని చెప్పారు.